ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయులకు శుభవార్త... మరికొద్ది గంటల్లో రెండు విమానాలు...

ABN , First Publish Date - 2022-02-25T17:37:09+05:30 IST

ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి రప్పించేందుకు

ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయులకు శుభవార్త... మరికొద్ది గంటల్లో రెండు విమానాలు...

న్యూఢిల్లీ : ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి రప్పించేందుకు శుక్రవారం-శనివారం రాత్రి 2 గంటలకు రెండు విమానాలను భారత ప్రభుత్వం పంపిస్తోంది. బుకారెస్ట్ మీదుగా భారతీయ పౌరులను ఉక్రెయిన్ నుంచి తీసుకొచ్చేందుకు రెండు ఎయిరిండియా విమానాలు బయల్దేరుతాయి. ఇండియన్ ఇవాక్యుయేషన్ టీమ్స్ రుమేనియా సరిహద్దులకు చేరుకున్నాయి. ఇక్కడి నుంచి ఉక్రెయిన్ రాజధాని కీవ్‌కు ప్రయాణించడానికి 12 గంటల సమయం పడుతుంది. 


సివిలియన్ విమానాల రాకపోకలపై ఉక్రెయిన్ నిషేధం విధించినందు వల్ల భారత పౌరులు సురక్షితంగా రావాలంటే బుకారెస్ట్ గుండా రావలసి ఉంటుంది. చాలా మంది భారతీయులు ఇండియన్ ఎంబసీలో ఆశ్రయం పొందుతున్నారు. ఈ ఎంబసీ పరిసరాల్లో పెద్ద ఎత్తున బాంబు దాడులు జరుగుతున్నట్లు తెలుస్తోంది. అయితే అదృష్టవశాత్తూ ఎటువంటి నష్టం జరగలేదని సమాచారం. 


Updated Date - 2022-02-25T17:37:09+05:30 IST