ఎస్‌ఐపై హత్యానేరం కేసు నమోదు చేయాలి

ABN , First Publish Date - 2020-08-05T11:38:01+05:30 IST

పోలీసు కస్టడిలో మృతి చెందిన కిరణ్‌కుమార్‌ కేసులో ఎస్‌ఐ విజయకుమార్‌పై హత్యానేరం కింద కేసు నమోదు చేయాలని, అలాగే సీఐ ఫిరోజ్‌ను సస్పెండ్‌ చేయాలని ..

ఎస్‌ఐపై హత్యానేరం కేసు నమోదు చేయాలి

ఒంగోలు(క్రైం), ఆగస్టు 4:  పోలీసు కస్టడిలో మృతి చెందిన కిరణ్‌కుమార్‌  కేసులో ఎస్‌ఐ విజయకుమార్‌పై హత్యానేరం కింద కేసు నమోదు చేయాలని, అలాగే సీఐ ఫిరోజ్‌ను సస్పెండ్‌ చేయాలని దళిత సంఘాల నాయకులు మంగళ వారం ఒంగోలులో ఎస్పీ సిద్థార్థకౌశల్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. చీరా లకు చెందిన కిరణ్‌కుమార్‌ను లాఠీతో కొట్టడం వల్లే తీవ్రంగా గాయపడ్డాడని, అ యితే బాధితుడికి చికిత్స చేయించడంలో సీఐ ఫిరోజ్‌ అలసత్వం వహించడం కారణంగా మృతి చెందాడని వివరించారు. దీనిపై స్పందించిన ఎస్పీ మాట్లాడు తూ నివేదికలు అందిన తరువాత తగిన చర్యలు  తీసుకుంటానని హమీ ఇచ్చి నట్లు వారు తెలిపారు. కార్యక్రమంలో నీలం నాగేంద్రరావు, విద్వాసాగర్‌, చప్పిడి వెంగళరావు, కరవది సుబ్బారావు, రఘురావ్‌, దాసరి శివాజీ, తోరటి ఆనంద్‌, కొమ్ము సుజన్‌, గద్దల శివాజీ, దారా అంజయ్య తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-08-05T11:38:01+05:30 IST