తాండూర్లో అరుదైన విగ్రహం లభ్యం
ABN , First Publish Date - 2020-03-19T11:18:53+05:30 IST
కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలం తాండూర్ గ్రా మ శివారులోని త్రిలింగ రామేశ్వర ఆలయం ప్రాంతంలో

నాగిరెడ్డిపేట, మార్చి 18: కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలం తాండూర్ గ్రా మ శివారులోని త్రిలింగ రామేశ్వర ఆలయం ప్రాంతంలో ఓ అరుదైన కాకతీయుల నాటి విగ్రహం లభ్యమైంది. రేణుక ఎల్లమ్మ విగ్ర హంగా గుర్తించాలని హైదరాబాద్కు చెందిన చరిత్ర పరిశోధకుడు శంకర్రెడ్డి కోరారు. ఆయన తన బృందంతో కలిసి తాండూర్ గ్రా మంలో పర్యటిస్తున్నాడు. విగ్రహనికి తల మాత్రమే ఉందని, రేణుక ఎల్లమ్మ విగ్రహం గా గుర్తించాలన్నారు.
జమదగ్ని, పరుశరాము డు కథలో రేణుక తలను పరుశురాముడు న రికాడని చరిత్రలో ఉందని, తలను మాత్రమే పూజించే ఆచారం ఉందని, రేణుక ఎల్లమ్మ, ఏకవీర, మహిళరా దెవా, ఆనాటి గ్రామ దేవ తలి తల మాత్రమే చెక్కి ఉందన్నారు. వీటిని పరిశీలిస్తే జైన, బుద్ధిస్టు కలిగి ఉందపి.
ఇది జైన విగ్రహం కాదని కంఠభారణము, చెక్కిన ముఖంలో లాలితత్వం తర్వాత బొట్టు పరిశీ లిస్తే ఇది స్త్రీ విగ్రహంలా ఉందని, కాకతీ యుల కాలంలోని గ్రామ దేవత ఎల్లమ్మ అ యి ఉంటుందన్నారు. ఇలాంటి ఆర్కియాలజి డిపార్ట్మెంట్ ఏ మ్యూజియంలో కూడా లే దని, ఈ అరుదైన విగ్రహన్ని కాపాడాల్సిన అ వసరం ఉందన్నారు. ఆయన వెంట ఉస్మాని యా యునివర్శిటీ పరిశోధకులు శ్రీనివాసన్, ఆర్కియాలజి శేఖర్, వరుమూర్తి ఉన్నారు.