మాజీ స్పీకర్ శ్రీపాదరావుకు ఘన నివాళి
ABN , First Publish Date - 2021-04-14T06:05:09+05:30 IST
మాజీ స్పీకర్ దుద్దిళ్ల శ్రీపాదరావు వర్ధంతి వేడుకలను కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం కరీంనగర్లో ఘనంగా నిర్వహించారు
కరీంనగర్ క్రైం, ఏప్రిల్13: మాజీ స్పీకర్ దుద్దిళ్ల శ్రీపాదరావు వర్ధంతి వేడుకలను కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం కరీంనగర్లో ఘనంగా నిర్వహించారు. డీసీసీ కార్యలయంలో నగర కాంగ్రెస్ అధ్యక్షులు కోమటిరెడ్డి నరేందర్రెడ్డి శ్రీపాదరావు చిత్రపఠానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతం బస్టాండ్ కూడలిలోని శ్రీపాదరావు విగ్రహానికి ఆయన పూలమాలలువేసి, అక్కడే అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి నరేందర్రెడ్డి మాట్లాడుతూ శ్రీపాదరావు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ స్పీకర్గా, పలుమార్లు ఎమ్మెల్యేగా పనిచేసి అన్నివర్గాల ప్రజలకు ఎనలేని సేవలు చేసి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారన్నారు. ఆయన ఆశయాలను కొనసాగిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ కోమటిరెడ్డి పద్మాకర్రెడ్డి, మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షులు ఎండీ తాజ్, ఎస్టీసెల్ అధ్యక్షులు శ్రావణ్నాయక్, నాయకులు కమ్రొద్దీన్, ఆకుల రాము, లింగంపల్లి బాబు, కుర్రపోచయ్య, గుండాటి శ్రీనివాస్రెడ్డి, మామిడి సత్యనారాయణరెడ్డి, ఎర్ర శ్రీనివాస్, దండి రవీందర్, సందీప్, అరుణ్ కుమార్, శేఖర్బాబు, నిహాల్ అహ్మద్, లయక్, మోహన్రెడ్డి, బొబ్బిలి విక్టర్, రామోహన్రావు, విజయ్ తదితరులు పాల్గొన్నారు.