పెళ్లయి 11ఏళ్లవుతున్నా పుట్టింటి నుంచి రానంటున్న భార్య.. భర్త వెళ్లి రమ్మని పిలవగా షాకింగ్ సమాధానం.. చివరకు..
ABN , First Publish Date - 2022-01-06T21:56:44+05:30 IST
ఛత్తీస్గడ్కు చెందిన ఓ మహిళ చిన్న కారణం చూపుతూ పెళ్లయిన 11వ రోజే పుట్టింటికి వెళ్లింది. 11 ఏళ్లవుతున్నా భర్తతో కలిసి ఉండేందుకు ఇష్టపడలేదు. చివరకు ఏం జరిగిందంటే..
పెళ్లయిన తర్వాత ఎన్ని సమస్యలు వచ్చినా.. మహిళలు భర్తతో కలిసి ఉండేందుకే ఇష్టపడతారు. అయితే కొందరు మాత్రం చిన్న చిన్న సమస్యలకే పుట్టింటికి వెళ్తుంటారు. ఈ క్రమంలో పెద్దలు సర్దిచెప్పి పంపుతూ ఉండడం సహజమే. పెద్ద పెద్ద సమస్యలు తలెత్తినప్పుడు కొన్నిసార్లు విడిపోయే సందర్భాలు కూడా ఉంటాయి. అయితే చిన్న చిన్న కారణాలకు ఎవరూ భర్తను వదిలి వెళ్లరు. కానీ ఛత్తీస్గడ్కు చెందిన ఓ మహిళ మాత్రం చిన్న కారణం చూపుతూ పెళ్లయిన 11వ రోజే పుట్టింటికి వెళ్లింది. 11 ఏళ్లవుతున్నా భర్తతో కలిసి ఉండేందుకు ఇష్టపడలేదు. చివరకు ఏం జరిగిందంటే..
ఛత్తీస్గఢ్ జాంజ్గిర్కు చెందిన సంతోష్ సింగ్ అనే వ్యక్తికి 2010 జులైలో వివాహమైంది. అత్తగారింటికి వెళ్లిన నవ వధువు.. 11రోజుల వరకు సంతోషంగానే ఉంది. తర్వాత ఓరోజు ఆమె తల్లిదండ్రులు వచ్చి.. ముఖ్యమైన కార్యక్రమం ఉందనే కారణం చూపి కుమార్తెను పుట్టింటికి తీసుకెళ్లారు. కొన్ని రోజులు గడవగానే భార్యను తీసుకొచ్చేందుకు వెళ్లాడు. అయితే ముహూర్తం సరిగా లేదని, కొన్నాళ్ల తర్వాత పంపుతామని చెప్పడంతో వెనుదిరిగి వచ్చాడు. అనంతరం మరికొన్ని రోజులు గడవగానే మళ్లీ భార్య కోసం వెళ్లిన భర్తకు.. అదే సమాధానం వచ్చింది.
ఆస్పత్రిలో అడ్మిట్ అయిన రోగితో నర్సు చాటింగ్.. ఓ రోజు ఫోన్లో ఆమె మాటలు విని..
కొన్ని నెలలు గడిచినా భార్య నుంచి ముహూర్తం సరిగా లేదంటూనే సమాధానం వస్తోంది. దీంతో సంతోష్ సింగ్ తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. 11 ఏళ్లవుతున్నా కూడా ఇప్పటికీ ముహూర్తం సరిగా లేదంటూనే చెబుతుండడంతో తనకు విడాకులు ఇప్పించాలని కోర్టును ఆశ్రయించాడు. ఇరువైపు వాదనలు విన్న కోర్టు.. గత నెలలో విడాకులు మంజూరు చేసింది. ముహూర్తం పేరుతో విడాకుల వరకూ దారి తీసిన ఈ అంశం.. స్థానికంగా హాట్ టాపిక్ అయింది.