టాటూ వేయించుకునేందుకు వెళ్లిన యువతి.. బయటికొచ్చి తన గోడును సోషల్ మీడియా ద్వారా వెళ్లబోసుకుంది..

ABN , First Publish Date - 2022-03-07T02:38:44+05:30 IST

ఓ యువకుడు టాటూ వేయించుకునేందుకు వెళ్లిన మహిళలు, యువతులను టార్గెట్ చేశారు. టాటూ వేసే క్రమంలో అతడు చేసిన పనులు సభ్యసమాజం తల దించుకునేలా ఉన్నాయి...

టాటూ వేయించుకునేందుకు వెళ్లిన యువతి.. బయటికొచ్చి తన గోడును సోషల్ మీడియా ద్వారా వెళ్లబోసుకుంది..
ప్రతీకాత్మక చిత్రం

మనుషుల్లో నేర ప్రవృత్తి రోజురోజుకూ పెరిగిపోతోంది. మంచి, మర్యాదలు మరచిపోయి.. మానవ మృగాళ్లలా మారుతున్నారు. తమ కామ వాంఛ తీర్చుకోవడానికి ఎంతకైనా తెగిస్తున్నారు. ఒంటరిగా మహిళ కనిపిస్తే చాలు.. తమ వక్ర బుద్ధిని బయటపెడుతున్నారు. తాజాగా, కేరళలో ఓ ఘటన చోటు చేసుకుంది. టాటూ వేయించుకునేందుకు వెళ్లిన మహిళలు, యువతులను టార్గెట్ చేశాడు, ఓ యువకుడు. టాటూ వేసే క్రమంలో అతడు చేసిన పనులు సభ్యసమాజం తల దించుకునేలా ఉన్నాయి. ఓ యువతి తనకు ఎదురైన చేదు అనుభవాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకోవడంతో సంచలనం కలిగించింది.


కేరళ రాష్ట్రం తిరువనంతపురం ఎటప్పళ్లిలో సుజీష్‌ అనే వ్యక్తి టాటూలు వేసే స్టూడియోను నడుపుతున్నాడు. కొన్నాళ్లు ఎలాంటి సమస్యలూ లేకుండా సక్రమంగా నడిపాడు. తర్వాత అతడి బుద్ధి తప్పు దారి పట్టింది. టాటూ పేరుతో యువతులను, మహిళలను ఎలాగైనా దారిలోకి తెచ్చుకోవాలని కుట్రపన్నాడు. కాగా ఇటీవల ఓ యువతి టాటూ వేయించుకునేందుకు స్టూడియోకి వచ్చింది. ఆమెకు టాటూ వేస్తున్నట్లు నటిస్తూ.. ఒక్కసారిగా బలవంతం చేశాడు. నోరు మూసి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయం బయట చెబితే చంపేస్తానని బెదిరించాడు. భయం భయంగా ఇంటికి వెళ్లిన యువతి.. చివరకు తనకు ఎదురైన చేదు అనుభవాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. ఆమె పోస్టు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు. విషయం బయటికి పొక్కడంతో బాధిత మహిళలంతా పోలీసులను ఆశ్రయించారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.

అర్ధరాత్రి బస్సులో లైట్లు ఆర్పిన కండక్టర్.. ఇదే అదునుగా ఓ మహిళపై వెనుక నుంచి చేయి వేసిన వ్యక్తి.. చివరకు ఏం జరిగిందంటే..

Updated Date - 2022-03-07T02:38:44+05:30 IST