ఏసీ కంప్రెషర్ పేలి ఇద్దరికి తీవ్ర గాయాలు
ABN , First Publish Date - 2021-04-14T05:15:00+05:30 IST
ఎయిర్ కండీషన్కు మరమ్మతు చేస్తుండగా ప్రమాదవశాత్తు కంప్రెషర్ పేలిపోవడంతో మెకానిక్తో పాటు ఇంటి యజమానికి కూడా తీవ్ర గాయాలకు గురయ్యారు.
ఏలూరు క్రైం, ఏప్రిల్ 13 :ఎయిర్ కండీషన్కు మరమ్మతు చేస్తుండగా ప్రమాదవశాత్తు కంప్రెషర్ పేలిపోవడంతో మెకానిక్తో పాటు ఇంటి యజమానికి కూడా తీవ్ర గాయాలకు గురయ్యారు. ఏలూరు శ్రీరామ్నగర్ రెండోరోడ్డులో నివాసం ఉంటున్న ఎం.మాధవరావు ఇంటిలో ఏపీ పని చేయకపోవడంతో అమీనాపేటకు చెందిన ఏసీ మెకానిక్ కడలి వెంకటేశ్వరరావు (48)కి చెప్పారు. మంగళవారం ఉదయం 10 గంటలకు మెకానిక్ ఏసీని విప్పి ఆ ఇంటి గుమ్మం వద్ద మరమ్మతు చేస్తుండగా కంప్రెషర్ పేలిపోయింది. దీంతో కడలి వెంకటే శ్వరరావుకు కాలు విరిగిపోయి, చేతులకు శరీరానికి తీవ్ర గాయాలు కాగా, అక్కడే కూర్చుని ఉన్న ఇంటి యజమాని మాధవరావుకు తలకు తీవ్ర గాయమైంది. ప్రస్తుతం ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై ఆసుపత్రి వైద్యులు ఎమ్మెల్సీగా నమోదు చేసిన ఆసుపత్రి ఔట్పోస్టు పోలీసులకు సమాచారం ఇచ్చారు.