కన్నియాకుమారి పార్లమెంటు ఉప ఎన్నికకు నేటి నుంచి దరఖాస్తుల స్వీకరణ
ABN , First Publish Date - 2021-03-01T12:20:58+05:30 IST
కన్నియాకుమారి పార్లమెంటు నియోజకవర్గ ఉప ఎన్నికలో పార్టీ తరఫున పోటీ చేయదలచుకున్న ఆశావాహులు సోమవారం నుంచి దరఖాస్తు సమర్పించవచ్చని
చెన్నై/ప్యారీస్ (ఆంధ్రజ్యోతి): కన్నియాకుమారి పార్లమెంటు నియోజకవర్గ ఉప ఎన్నికలో పార్టీ తరఫున పోటీ చేయదలచుకున్న ఆశావాహులు సోమవారం నుంచి దరఖాస్తు సమర్పించవచ్చని తమిళనాడు కాంగ్రెస్ కమిటీ (టీఎన్సీసీ) అధ్యక్షుడు కేఎస్ అళగిరి ప్రకటించారు. ఆయన ఆదివారం విడుదల చేసిన ప్రకటనలో, స్థానిక రాయపేటలోని టీఎన్సీసీ ప్రధాన కార్యాలయం సత్యమూర్తి భవన్లో సోమవారం ఉదయం 10 గంటల నుంచి పొందిన దరఖాస్తులను పూర్తిచేసి పార్టీ ఫండ్గా రూ.25 వేలను చెల్లించి పార్టీ ఎన్నికల నిర్వాహకుల వద్ద సమర్పించవచ్చని తెలిపారు.