పరిషత్ ఎన్నికల్లో వైసీపీ నేతలు ఓడిపోతే దానికి దళితులు కారణమా?: అచ్చెన్న

ABN , First Publish Date - 2021-10-17T16:26:24+05:30 IST

ప్రకాశం జిల్లా, మద్దలకట్టలో దళితులపై వైసీపీ నేతల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని అచ్చెన్న అన్నారు.

పరిషత్ ఎన్నికల్లో వైసీపీ నేతలు ఓడిపోతే దానికి దళితులు కారణమా?: అచ్చెన్న

అమరావతి: ప్రకాశం జిల్లా, మద్దలకట్టలో దళితులపై వైసీపీ నేతల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ దళితులను అణచివేయడమే వైసీపీ నైజంగా కనిపిస్తోందని విమర్శించారు. పరిషత్ ఎన్నికల్లో వైసీపీ నేతలు ఓడిపోతే దానికి దళితులు కారణమవుతారా? అని ప్రశ్నించారు. సొంత నియోజకవర్గంలో ఎస్సీలపై దాడులు జరుగుతుంటే.. మంత్రి ఆదిమూలపు సురేష్ ఏం చేస్తున్నారని నిలదీశారు. వైసీపీలోని ఓ వర్గానికి సురేష్ భయపడుతున్నారని ఎద్దేవా చేశారు. దళితుల భూములకు, ప్రాణాలకు రక్షణ లేకుండా పోయిందన్నారు. దళితులపై దాడి చేసిన వైసీపీ నేతలను తక్షణమే అరెస్టు చేసి శిక్షించాలని అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు.

Updated Date - 2021-10-17T16:26:24+05:30 IST