పేదలను ఆదుకుంటున్న దాతలు
ABN , First Publish Date - 2020-04-01T10:22:02+05:30 IST
అచ్యుతాపురం మండలం మోసయ్యపేటలో మంగళవారం ముఠా కార్మిక సంఘ నాయకుడు పంచదార్ల అప్పల కొండ 800 మంది పేదలకు 25 కిలోల బియ్యం పంపిణీ చేశారు.
అచ్యుతాపురం/రాంబిల్లి : అచ్యుతాపురం మండలం మోసయ్యపేటలో మంగళవారం ముఠా కార్మిక సంఘ నాయకుడు పంచదార్ల అప్పల కొండ 800 మంది పేదలకు 25 కిలోల బియ్యం పంపిణీ చేశారు. ఎం.జె.పురంలో మాజీ సర్పంచ్ కరెడ్ల ప్రకాష్ మూడు వందల ఆహార పొట్లాలను ఎస్ఐ జి.లక్ష్మణరావు ద్వారా పంపిణీ చేశారు. రాంబిల్లిలో 200 మంది పేదలకు 16 రకాల కూరగాయలు, నిత్యావసర వస్తువులను బీజేపీ ప్రధాన కార్యదర్శి బి.వి.ఎన్.వర్మ పంపిణీ చేశారు.
పాలిటెక్నిక్ ప్రిన్సిపాల్ విరాళం
మునగపాక : లాక్డౌన్ అమలు, కరోనాపై అవగాహన నిమిత్తం గ్రామాల్లో ప్రచారం చేయడానికి సుమారు రూ.50వేలు విలువ చేసే నాలుగు మైక్లతోపాటు సామగ్రిని ఎస్ఐ డి.శ్రీనివాసరావుకు ఆర్ఈసీఎస్ పాలిటెక్నికల్ కళాశాల ప్రిన్సిపాల్ బి.ఉమాశంకర్ విరాళంగా అందజేశారు.