వృక్ష సంపదను పెంపొందించాలి

ABN , First Publish Date - 2020-08-05T09:54:50+05:30 IST

గ్రామాల్లో మొక్కలు విరవిగా నాటి వృక్ష సంపదను పెంపొందించాలని జిల్లా అడిషనల్‌ కలెక్టర్‌(స్థానిక సంస్థలు) నరసింహరెడ్డి అన్నారు.

వృక్ష సంపదను పెంపొందించాలి

అడిషనల్‌ కలెక్టర్‌ నరసింహారెడ్డి


రామడగు, ఆగస్టు 4: గ్రామాల్లో మొక్కలు విరవిగా నాటి వృక్ష సంపదను పెంపొందించాలని జిల్లా అడిషనల్‌ కలెక్టర్‌(స్థానిక సంస్థలు) నరసింహరెడ్డి అన్నారు. మంగళవారం రామడుగు మండలం దేశరాజ్‌పల్లిలో అవెన్యూ ప్లాంటేషన్‌లో భాగంగా మొక్కలు నాటారు. కార్యక్రమంలో డీఆర్‌డీవో వెంకటేశ్వర్‌రావు, ఏపీడీ మంజులాదేవి, ఎంపీడీవో మల్హొత్రా, సర్పంచ్‌ కోల రమేశ్‌, ఎంపీటీసీ మహేందర్‌ రెడ్డి, ఏపీవో చంద్రశేఖర్‌, తదితరులు పాల్గొన్నారు. వెదిరలో కుంట చెరువు కట్టపై ఈఈ గుప్త, ఎంపీడీవో మల్హొత్ర తదితరులు మొక్కలు నాటారు.

Updated Date - 2020-08-05T09:54:50+05:30 IST