కాంగ్రెస్‌ పార్టీలో చేరికలు

ABN , First Publish Date - 2021-10-18T03:45:07+05:30 IST

జిల్లా కేంద్రంలోని పద్మనాయక ఫంక్షన్‌ హాలులో ఆది వారం మాజీ ఎంఎల్‌సీ, ఏఐసీసీ సభ్యుడు కొక్కిరాల ప్రేంసాగర్‌రావు ఆధ్వ ర్యంలో వివిధ పార్టీల నుంచి సుమారు 200 మంది కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ఏఐఎస్‌ఎఫ్‌ రాష్ట్ర నాయకుడు శ్యాంకుమార్‌, సీపీఐ సీనియర్‌ నాయకుడు రవి, కృష్ణమూర్తిల నాయకత్వంలో ప్రేంసాగర్‌రావు నేతృత్వంలో కాంగ్రెస్‌ పార్టీలో చేరినట్లు తెలిపారు.

కాంగ్రెస్‌ పార్టీలో చేరికలు
కాంగ్రెస్‌ పార్టీలో చేరిన వారితో మాజీ ఎంఎల్‌సీ ప్రేంసాగర్‌రావు

ఏసీసీ, అక్టోబరు 17: జిల్లా కేంద్రంలోని పద్మనాయక ఫంక్షన్‌ హాలులో ఆది వారం మాజీ ఎంఎల్‌సీ, ఏఐసీసీ సభ్యుడు కొక్కిరాల ప్రేంసాగర్‌రావు ఆధ్వ ర్యంలో వివిధ పార్టీల నుంచి సుమారు 200 మంది కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ఏఐఎస్‌ఎఫ్‌ రాష్ట్ర నాయకుడు శ్యాంకుమార్‌, సీపీఐ సీనియర్‌ నాయకుడు రవి,  కృష్ణమూర్తిల నాయకత్వంలో ప్రేంసాగర్‌రావు నేతృత్వంలో కాంగ్రెస్‌ పార్టీలో చేరినట్లు తెలిపారు. ప్రేంసాగర్‌రావు మాట్లాడుతూ కార్యకర్తలకు, పార్టీ శ్రేణు లకు ఏ కష్టం వచ్చినా ఎల్లవేళలా అందుబాటులో ఉండి సేవలందిస్తానని తెలి పారు. పీసీసీ మాజీ అధికార ప్రతినిధి చిట్ల సత్యనారాయణ, బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు తిరుపతి, మున్సిపల్‌ ఫ్లోర్‌లీడర్లు ఉప్పలయ్య, వేణు, డిప్యూటీ ఫ్లోర్‌లీడర్లు సంజీవ్‌, మజిద్‌, భూపతి, జడ్పీటీసీ నాగరాణి, జిల్లా మహిళ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు రజిత, శ్యామల, హేమలత, శేఖర్‌, ప్రభాకర్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2021-10-18T03:45:07+05:30 IST