భార్యను అన్న కుటుంబం వద్ద ఉంచి.. ఉపాధి కోసం గల్ఫ్‌కు వెళ్లిన తమ్ముడు.. ఆ తర్వాత మూడు హత్యలు ఎందుకు జరిగాయంటే..

ABN , First Publish Date - 2021-09-07T20:23:57+05:30 IST

అతను గల్ఫ్‌లో పని చేసే కార్మికుడు.. తన భార్యను అన్న కుటుంబం వద్ద ఉంచి తను ఒక్కడే గల్ఫ్ వెళ్లాడు..

భార్యను అన్న కుటుంబం వద్ద ఉంచి.. ఉపాధి కోసం గల్ఫ్‌కు వెళ్లిన తమ్ముడు.. ఆ తర్వాత మూడు హత్యలు ఎందుకు జరిగాయంటే..

తన ఇంట్లో ఉంటున్న తమ్ముడి భార్యతో అన్న వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు.. తమ సంబంధానికి భార్య, పిల్లలు అడ్డు వస్తున్నారని భావించాడు.. ముగ్గురునీ చంపేస్తే తమ్ముడి భార్యతో హాయిగా ఉండవచ్చని పథకం రచించాడు.. భార్యను, కన్న బిడ్డలను అత్యంత కిరాతకంగా హతమార్చాడు.. అనంతరం పోలీస్ స్టేషన్‌కు నడుచుకుంటూ వెళ్లి లొంగిపోయాడు.. ఉత్తరప్రదేశ్‌లోని ఖుషీనగర్‌లో ఈ ఘటన జరిగింది. 


రాజేష్ గుప్తా అనే వ్యక్తి తన భార్య నిక్కీ, పిల్లలు శివమ్ (7), ఆయుష్ (3)లతో కలిసి ఖుషీనగర్‌‌లో నివసిస్తున్నాడు. రాజేష్ తమ్ముడు జీవనోపాధి కోసం గల్ఫ్ వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. భార్యను అన్న ఇంట్లో ఉంచి ఒక్కడే గల్ఫ్ దేశాలకు వెళ్లాడు. కొద్ది రోజులకు, తమ్ముడి భార్యతో రాజేష్ వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఆమెతో బంధాన్ని శాశ్వతం చేసుకోవడానికి తన భార్య, పిల్లలు అడ్డువస్తున్నారని భావించాడు. వారిని అడ్డు తప్పించుకోవాలనుకున్నాడు. 

ఇది కూడా చదవండి: రూ.3 లక్షల విలువైన నగలు, డబ్బుతో బస్సులో ఓ మహిళా ఎస్సై జర్నీ.. మంచినీళ్ల బాటిల్‌ కోసం బ్యాగ్ ఓపెన్ చేసి చూసి షాక్..


ఇది కూడా చదవండి: సీసీ కెమెరాలో షాకింగ్ దృశ్యాలు.. అర్ధరాత్రి గాఢనిద్రలో ఉన్న వ్యక్తి వద్దకు చేరుకున్న పాము.. ఆ తర్వాత..

శనివారం రాత్రి 12 గంటల సమయంలో నిద్రిస్తున్న భార్యను గొంతు కోసి చంపేశాడు. అనంతరం చిన్న పిల్లలని కూడా చూడకుండా శివమ్, ఆయుష్‌ల ప్రాణాలు తీశాడు. అనంతరం పది కిలోమీటర్లు నడుచుకుని పోలీస్ స్టేషన్‌కు వెళ్లి జరిగింది చెప్పి లొంగిపోయాడు. పోలీసులు రాజేష్ ఇంటికి వెళ్లి చూసేసరికి నిక్కీ, శివమ్, ఆయుష్‌ల మృతదేహాలు రక్తపు మడుగులో పడి ఉన్నాయి. పోలీసులు ఆ మృతదేహాలను పోస్ట్ మార్టమ్‌కు తరలించారు. రాజేష్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. 

Updated Date - 2021-09-07T20:23:57+05:30 IST