ముగిసిన వ్యవసాయ మండలి సమావేశం

ABN , First Publish Date - 2021-05-05T06:23:43+05:30 IST

మార్టేరు వ్యవసాయ పరిశోధనా స్థానంలో వ్యవసాయ విశ్వవిద్యాలయ పరిశోధన సంచాలకుడు డాక్టర్‌ త్రిమూర్తులు అధ్యక్షతన జరుగుతున్న మండలి ఆన్‌లైన్‌ సమావేశాలు మంగళవారంతో ముగిశాయి.

ముగిసిన వ్యవసాయ మండలి సమావేశం
సమావేశంలో పాల్గొన్న శాస్త్రవేత్తలు

పెనుమంట్ర, మే 4: మార్టేరు వ్యవసాయ పరిశోధనా స్థానంలో వ్యవసాయ విశ్వవిద్యాలయ పరిశోధన సంచాలకుడు డాక్టర్‌ త్రిమూర్తులు అధ్యక్షతన జరుగుతున్న మండలి ఆన్‌లైన్‌ సమావేశాలు మంగళవారంతో ముగిశాయి. ఈ సందర్భంగా ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించిన రైతుల సమస్యలపైన విత్తనాలపై శాస్త్రవేత్తలు చర్చించారు. యాంత్రీకరణ అవసరంపై చర్చించారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా నైపుణ్యతను పెంచాలని సూచించారు. చీడపీడలపై చర్చిం చి నివారణకు తీసుకోవాలని అంశాలపై వివరించారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని రూ పొందించే దిశగా శాస్త్రీయ పరిశోధనలను రూపొందించే కార్యాచరణ ప్రణాళికలను తయారుచేశారు.  సమావేశంలో డాక్టర్‌ జోగినాయుడు తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-05-05T06:23:43+05:30 IST