విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కల్పించాలి

ABN , First Publish Date - 2021-10-22T03:41:46+05:30 IST

ఇంటర్మీడియట్‌ పరీక్షలు రాసే విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కల్పించా లని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. గురువారం పరీక్షల నిర్వహణ, తీసుకోవాల్సిన జాగ్రత్త లపై కలెక్టర్లతో వీడియోకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపుకలెక్టర్‌ రాజేశం, జిల్లా మాధ్య మిక విద్యాధికారి శ్రీధర్‌సుమన్‌ పాల్గొని పరీక్షల కోసం తీసుకున్న ఏర్పాట్ల గురించి వివరించారు.

విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కల్పించాలి
వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న అదనపు కలెక్టర్‌, డీఐఈవో

- వీడియో కాన్ఫరెన్స్‌లో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి

ఆసిఫాబాద్‌, అక్టోబరు 21: ఇంటర్మీడియట్‌ పరీక్షలు రాసే విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కల్పించా లని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. గురువారం పరీక్షల నిర్వహణ, తీసుకోవాల్సిన జాగ్రత్త లపై కలెక్టర్లతో వీడియోకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపుకలెక్టర్‌ రాజేశం, జిల్లా మాధ్య మిక విద్యాధికారి శ్రీధర్‌సుమన్‌ పాల్గొని పరీక్షల కోసం తీసుకున్న ఏర్పాట్ల గురించి వివరించారు. అదనపు కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో 24పరీక్షా కేంద్రాల్లో 5208 మంది పరీక్షలు రాయనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు, నీటివసతి, రవాణా తదితర ఏర్పాట్లు చేయా ల్సిందిగా సూచించారు. ఇంటర్‌ బోర్డు నియమావళికి లోబడి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలన్నారు. కొవిడ్‌ నిబంధనలు పాటించాలని, విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్నిజాగ్రత్తలు తీసుకోవా లని ఆదేశించారు. సమావేశంలో జిల్లా పరీక్షల కమిటీ సభ్యులు శంకర్‌, తిరుపతి, పోలీసు, విద్య, వైద్య శాఖల అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2021-10-22T03:41:46+05:30 IST