ఊరే కదిలొచ్చింది..
ABN , First Publish Date - 2020-12-01T06:14:33+05:30 IST
మంత్రాలయంలో పుష్కరస్నానాలు చేసేందుకు అనంతపురం జిల్లా తలుపుల నుంచి 50 మందికి పైగా భక్తులు ప్రత్యేక బస్సులో వచ్చారు.
ఎమ్మిగనూరు టౌన్, నవంబరు 30: మంత్రాలయంలో పుష్కరస్నానాలు చేసేందుకు అనంతపురం జిల్లా తలుపుల నుంచి 50 మందికి పైగా భక్తులు ప్రత్యేక బస్సులో వచ్చారు. ఘాట్ వద్ద పుణ్య స్నానాలు చేసి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం గ్రామదేవత మంచాలమ్మ, రాఘవేంద్ర స్వామి బృందావనాన్ని దర్శించుకు న్నారు. జ్ఞాపకంగా గ్రూపు ఫొటో తీసుకు న్నారు. పుణ్యక్షేత్రాలకు అందరం ఇలా కలిసే వెళ్తుంటామని ఎద్దుల రాముడు తెలిపారు.