ముగ్గురికి సహాయ ఖజానా అధికారులుగా పదోన్నతి
ABN , First Publish Date - 2020-08-12T11:24:16+05:30 IST
ఖజానా శాఖలో పనిచేస్తున్న ముగ్గురు ఉపఖజానా అధికారులకు సహాయ ఖజానాధికారులుగా పదోన్నతులు లభించాయి. జిల్లాఖజానా కార్యాలయంలో ఉపఖజానాధికారిగా, ఏపీ రాష్ట్ర ఉద్యోగ సంఘ అధ్యక్షుడిగా
కడప(కలెక్టరేట్)ఆగష్టు 11: ఖజానా శాఖలో పనిచేస్తున్న ముగ్గురు ఉపఖజానా అధికారులకు సహాయ ఖజానాధికారులుగా పదోన్నతులు లభించాయి. జిల్లాఖజానా కార్యాలయంలో ఉపఖజానాధికారిగా, ఏపీ రాష్ట్ర ఉద్యోగ సంఘ అధ్యక్షుడిగా విధులునిర్వహిస్తున్న గోవిందు రవికుమార్ కు ఏపీవీవీపీ నందు, మైదుకూరు ఉపఖజానాధికారి రవిశేఖర్ కు కర్నూల్ సోషల్ వెల్పేర్ నందు ఏఏఓగా, జిల్లా కేంద్రంలో ఉప ఖజానాధికారిగా పని చేస్తున్న సుబ్బరాయుడుకు అనంతపురం జిల్లా కార్యాలయానికి పదోన్నతులు కల్పిస్తూ ఆశాఖ రాష్ట్ర ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. కమలా పురం లో పని చేసే ఎగువ శ్రేణి గణికుడు నాగ సుబ్బయ్యను లక్కిరెడ్డిపల్లి ఎస్టీఓగా, రాయ చోటిలో పని చేసే అమరావతికి జిల్లా ఖజానాకార్యాలయంలో ఎస్టీఓగా పదోన్నతులు కల్పించారు.