అధిక నిధులు కేటాయించాలి

ABN , First Publish Date - 2021-06-18T05:15:48+05:30 IST

కోదాడ నియోజకవర్గ అభివృద్ధికి అధిక నిధులను కేటాయించాలని ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్‌ కోరారు.

అధిక నిధులు కేటాయించాలి
మంత్రి కేటీఆర్‌, హరీ్‌షరావులకు విన్నవిస్తున్న ఎమ్మెల్యే మల్లయ్యయాదవ్‌

మంత్రులు కేటీఆర్‌, హరీష్‌రావులను కోరిన ఎమ్మెల్యే మల్లయ్యయాదవ్‌

కోదాడ, జూన్‌ 17: కోదాడ నియోజకవర్గ అభివృద్ధికి అధిక నిధులను కేటాయించాలని ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్‌ కోరారు. ఈ మేరకు హైదరాబాద్‌లో మంత్రి కేటీఆర్‌, హరీ్‌షరావులను గురువారం కలిశారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని పలు సమస్యలను మంత్రుల దృష్టికి తీసుకెళ్లినట్లు ఎమ్మెల్యే తెలిపారు. కోదాడలో 100 పడకల ఆసుపత్రిని ఏర్పాటు చేయాలని; రేషన్‌ డీలర్ల సమస్యలను పరిష్కరించాలని కోరినట్లు ఆయన వివరించారు. కాగా మంత్రులు సానుకూలంగా స్పందించి, అభివృద్థి కార్యక్రమాలకు నిధులు కేటాయిస్తామని హమీ ఇచ్చినట్లు ఎమ్మెల్యే తెలిపారు.  

Updated Date - 2021-06-18T05:15:48+05:30 IST