తప్పుడు ప్రచారాలు మానండి
ABN , First Publish Date - 2020-08-13T12:48:04+05:30 IST
అమరావతిలో ఎటువంటి నిర్మాణాలు జరగలేదని వైసీపీ నాయకులు..
తుళ్లూరు/తాడికొండ(గుంటూరు): అమరావతిలో ఎటువంటి నిర్మాణాలు జరగలేదని వైసీపీ నాయకులు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారంటూ రాజధాని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిని ఏకైక రాజధానిగా కొనసాగించాలని చేస్తున్న ఆందోళనలు బుధవారం 239వ రోజుకు చేరుకున్నాయి. వెలగపూడి, తుళ్లూరు, పెదపరిమి, రాయపూడి, అబ్బరాజుపాలెం, అనంతవరం తదితర గ్రామాల్లో దీక్షలు, నిరసనలు కొనసాగాయి.
ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ భూములు త్యాగం చేసిన రైతులను నడిరోడ్డుకు నెట్టి, అమరావతిపై తప్పుడు ప్రచారాలతో రాష్ట్ర ప్రజలను పాలకులు మోసం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మూడు రాజధానుల ప్రతిపాదనలు కూడా పాలకుల స్వార్థ ప్రయోజనాల కోసమేనన్నారు. కాగా, తాడికొండ మండలం పొన్నెకల్లు, మోతడక గ్రామాల రైతులు, మహిళలు బుధవారం కూడా నిరసనలు తెలిపారు.