రాజధాని రైతుల దీక్షా శిబిరాల వద్ద ఉద్రిక్తత

ABN , First Publish Date - 2020-12-04T19:19:19+05:30 IST

రాజధాని అమరావతినే కొనసాగించాలంటూ రైతులు చేపట్టిన దీక్షా శిబిరాల వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది.

రాజధాని రైతుల దీక్షా శిబిరాల వద్ద ఉద్రిక్తత

అమరావతి: రాజధాని అమరావతినే కొనసాగించాలంటూ రైతులు చేపట్టిన దీక్షా శిబిరాల వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. మంత్రులు కొడాలి నాని, బొత్స దిష్టి బొమ్మల దగ్ధానికి రైతులు యత్నించారు. దీంతో వారిని పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులు, రైతులకు మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. ఇరువురి మధ్య తోపులాటలు జరిగాయి. దీంతో అక్కడి పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. 

Updated Date - 2020-12-04T19:19:19+05:30 IST