కరోనా పరిస్థితిపై కమలా హ్యారిస్ వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2021-05-08T05:18:34+05:30 IST

భారత శ్రేయస్సు అమెరికా బాధ్యతని ఆ దేశ ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ పేర్కొన్నారు. భారత్‌లో తన కుటుంబం కూడా ఉందని..

కరోనా పరిస్థితిపై కమలా హ్యారిస్ వ్యాఖ్యలు

వాషింగ్టన్: భారత శ్రేయస్సు అమెరికా బాధ్యతని ఆ దేశ ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ పేర్కొన్నారు. భారత్‌లో తన కుటుంబం కూడా ఉందని, తన తల్లి అక్కడే పుట్టి పెరిగిందని, అలాంటి భారత్ శ్రేయస్సు అమెరికాకు ఎంతో ముఖ్యమని ఆమె అన్నారు. భారత్‌లో నెలకొన్న కరోనా పరిస్థితులను అదుపులోకి తెచ్చేందుకు చేయాల్సిన సాయం గురించి ఏర్పాటుచేసిన సమావేశంలో కమలా మట్లాడారు. ప్రస్తుతం భారత్‌లో పరిస్థితి చూస్తుంటే గుండెపగిలిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా ప్రారంభమైనప్పుడు భారత్ అమెరికాకు కూడా సాయం అందించిందని, అయితే ఇప్పుడు భారత్ కష్టాల్లో ఉందని, కష్టాల్లో ఉన్న మిత్ర దేశానికి సాయం చేయడానికి అమెరికా ఎప్పుడూ ముందుంటుందని అన్నారు. భారత్ మిత్ర దేశంగా ఆ బాధ్యత తమపై ఉందని కమలా హ్యారిస్ పేర్కొన్నారు.

Updated Date - 2021-05-08T05:18:34+05:30 IST