ట్రంప్ కోసం.. గిఫ్ట్ సిద్ధం చేస్తున్న అమృత్‌సర్ కళాకారుడు!

ABN , First Publish Date - 2020-02-23T01:27:10+05:30 IST

దేశంలో ఇప్పుడు ఎక్కడ చూసినా ట్రంప్ హవానే కనిపిస్తోంది. ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు

ట్రంప్ కోసం.. గిఫ్ట్ సిద్ధం చేస్తున్న అమృత్‌సర్ కళాకారుడు!

అమృత్‌సర్: దేశంలో ఇప్పుడు ఎక్కడ చూసినా ట్రంప్ హవానే కనిపిస్తోంది. ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు ప్రభుత్వం ఘనంగా ఏర్పాటు చేస్తుండగా మరోవైపు ఆయనను కలిసేందుకు పలువురు ఉవ్విళ్లూరుతున్నారు. అమృత్‌సర్‌కు చెందిన జగ్‌జోత్ సింగ్ రూబల్ అనే కళాకారుడు ట్రంప్ పది అడుగుల నిలువెత్తు అయిల్ పెయింటింగ్‌ను రెడీ చేశాడు. ఈ చిత్తరవును పెయింట్ చేసేందుకు తనకు 20 రోజులు పట్టిందని చెప్పాడు. ట్రంప్‌కు స్వయంగా తన చేతుల మీదుగా ఈ చిత్తరువును అందించాలని అనుకుంటున్నానని, భద్రతా పరమైన కారణాల వల్ల అది సాధ్యం కాకపోతే అమెరికా, ఇండియాలోని గ్యాలరీల్లో దానిని ప్రదర్శిస్తానని వివరించారు.


జగ్‌జోత్ గతంలో బరాక్ ఒబామా పెయింటింగ్ కూడా చిత్రీకరించాడు. అంతేకాదు, భారత ప్రధాని నరేంద్రమోదీ, బ్రిటన్ రాజ దంపతులు  హ్యారీ, మేఘన్ మార్కెల్ పెయింటింగులు కూడా గీశారు. ఆయన పెయింటింగ్స్‌ చూసి మురిసిపోయిన మాజీ రాష్ట్రపతులు ప్రతిభా పాటిల్, ప్రణబ్ ముఖర్జీలు జగ్‌జోత్‌ను ప్రశంసించారు. బాలీవుడ్ నటులు అభిషేక్ బచ్చన్, కరీనాకపూర్, శిల్పాశెట్టి తదితరులు కూడా జగ్‌జోత్ పెయింటింగులను గిఫ్ట్‌గా ఇచ్చాడు.


Updated Date - 2020-02-23T01:27:10+05:30 IST