Anantapurలో స్టేజ్ 1 కాంట్రాక్టర్ మాయాజాలం
ABN , First Publish Date - 2021-08-14T14:05:10+05:30 IST
జిల్లాలో స్టేజ్ 1 కాంట్రాక్టర్ మాయాజాలం వెలుగులోకి వచ్చింది. జంగాలపల్లి గోడౌన్ నుంచి నేరుగా
అనంతపురం: జిల్లాలో స్టేజ్ 1 కాంట్రాక్టర్ మాయాజాలం వెలుగులోకి వచ్చింది. జంగాలపల్లి గోడౌన్ నుంచి నేరుగా కర్ణాటకకు లారీల్లో పీడీఎస్ బియ్యం తరలింపునకు యత్నించగా... కొడికొండ చెక్ పోస్ట్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తున్న పోలీసులకు పీడీఎస్ బియ్యం తరలిస్తున్న లారీ(AP02TB0036) పట్టుబడింది. స్టాక్ పాయింట్లకు పంపిణీ చేయాల్సిన పీడీఎస్ బియ్యం కర్ణాటక తరలిస్తుండగా చిలమత్తూరు పోలీసులు పట్టుకున్నారు. పట్టుబడ్డ లారీని చిలమత్తూరు ఎస్సై రంగుడుయాదవ్ స్టేషన్కు తరలించారు. కాగా... బియ్యం లారీని తప్పించేలా పోలీసులపై అధికార పార్టీ నేతలు ఒత్తిడికి గురి చేస్తున్నట్లు సమాచారం.