Anantapur: ఖరీదైన కుక్కలే దొంగల టార్గెట్
ABN , First Publish Date - 2021-11-18T14:12:50+05:30 IST
జిల్లాలో కొందరు దుండగులు ఖరీదైన కుక్కలను టార్గెట్ చేస్తూ అదును చూసి వాటిని అపహరిస్తున్నారు.
అనంతపురం: జిల్లాలో కొందరు దుండగులు ఖరీదైన కుక్కలను టార్గెట్ చేస్తూ అదును చూసి వాటిని అపహరిస్తున్నారు. గత వారం రోజులుగా ఇళ్ల వద్ద కట్టేసిన కుక్కలు.. కుక్కల పిల్లలను దుండగులు గుట్టుచప్పుడు కాకుండా ఎత్తుకుపోయారు. తన కుక్క పిల్లను అపహరించడంపై లెక్చరర్ కాలనీ వాసి సుదర్శన్ నాయుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు.