రూ.50లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలి

ABN , First Publish Date - 2021-03-03T05:33:11+05:30 IST

కరోనా వ్యాక్సిన్‌ వికటించి అంగ న్‌వాడీ కార్యకర్త సునీత మృతి చెందినందున ఆమె కుటుంబానికి రూ. 50లక్షల ఎక్స్‌గ్రేషి ఇవ్వాలని ఏపీ అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌హెల్పర్స్‌ యూనియన్‌ ప్రతినిధులు మంగళవారం ఒంగోలులో కలెక్టర్‌ పోలా భాస్కర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు.

రూ.50లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలి

ఒంగోలు(కలెక్టరేట్‌), మార్చి 2 : కరోనా వ్యాక్సిన్‌ వికటించి అంగ న్‌వాడీ కార్యకర్త సునీత మృతి చెందినందున ఆమె కుటుంబానికి రూ. 50లక్షల ఎక్స్‌గ్రేషి ఇవ్వాలని ఏపీ అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌హెల్పర్స్‌ యూనియన్‌ ప్రతినిధులు మంగళవారం ఒంగోలులో కలెక్టర్‌ పోలా భాస్కర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించి న రూ.50 లక్షల ఎక్స్‌గ్రేషియాతో పాటు ఇళ్ళ స్థలం, కుటుంబంలో  ఒక రికి ఉద్యోగం ఇచ్చి ఆదుకోవాలని కలెక్టర్‌ను కోరారు. కార్యక్రమంలో యూనియన్‌ రాష్ట్ర కార్యదర్శి ఐ.కామేశ్వరి,  ప్రధానకార్యదర్శి అన్నపూర్ణ, అధ్యక్షురాలు పి.రేఖాఎలిజబెత్‌, కేవీ.సుబ్బమ్మ, నాతాని ధనలక్ష్మి, చిడి తోటి ఇందిర, సీఐటీయు జిల్లా ప్రధాన కార్యదర్శి చీకటి శ్రీనివాసరావు, అనురాధ, రాధిక, భూలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-03-03T05:33:11+05:30 IST