సత్యదేవుడి సన్నిధిలో అన్నప్రసాద వితరణ పునఃప్రారంభం

ABN , First Publish Date - 2021-10-09T07:05:05+05:30 IST

అన్నవరం, అక్టోబరు 8: కొవిడ్‌ కారణంగా ఎనిమిది నెలలుగా నిలిచిన సత్యదేవుడి అన్న ప్రసాద వితరణ శుక్రవారం పునఃప్రారంభించారు. శుక్రవారం ఉదయం అన్నవరం దేవస్థానం చైర్మన్‌ రాజా ఐవీ రోహిత్‌ భక్తులకు అన్నప్రసాదాన్ని వడ్డన చేశారు. తొలి రోజున సుమారు మూడు వే

సత్యదేవుడి సన్నిధిలో అన్నప్రసాద వితరణ పునఃప్రారంభం
భక్తులకు అన్న ప్రసాదం వడ్డన చేస్తున్న చైర్మన్‌ రోహిత్‌

అన్నవరం, అక్టోబరు 8: కొవిడ్‌ కారణంగా ఎనిమిది నెలలుగా నిలిచిన సత్యదేవుడి అన్న ప్రసాద వితరణ శుక్రవారం పునఃప్రారంభించారు. శుక్రవారం ఉదయం అన్నవరం దేవస్థానం చైర్మన్‌ రాజా ఐవీ రోహిత్‌ భక్తులకు అన్నప్రసాదాన్ని వడ్డన చేశారు. తొలి రోజున సుమారు మూడు వేల మందికి అన్నప్రసాదం అం దించినట్టు అన్నదాన విభాగ ఏఈవో ప్రసాద్‌ తెలిపారు. అన్నప్రసాదం స్వీకరించిన భక్తులను వంటకాల నాణ్యత గురించి అడిగి తెలుసుకున్నారు. వారు సంతృప్తి వ్యక్తంచేయడంతో అన్నదాన విభాగ సిబ్బందిని చైర్మన్‌ అభినందించారు. ఈ కార్యక్రమంలో సహాయ కమిషనర్‌ రమేష్‌బాబు, ట్రస్టీ గాదె రాజశేఖరరెడ్డి, అన్నదాన విభాగ ఏఈవో ప్రసాద్‌ తెలిపారు.

Updated Date - 2021-10-09T07:05:05+05:30 IST