ఢిల్లీకి చేరుకున్న అన్నెం జ్యోతి
ABN , First Publish Date - 2020-02-28T10:55:44+05:30 IST
చైనాలోని వ్యూహాన్లో ఉండిపోయిన ఆంధ్రా యువతి అన్నెం జ్యోతి గురువారం స్వదేశానికి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి చేరుకున్నారు. ఆమెను విమానాశ్రయం నుంచి నేరుగా మిలటరీ ఆసుపత్రికి తరలించారు.
మహానంది, పిబ్రవరి 27: చైనాలోని వ్యూహాన్లో ఉండిపోయిన ఆంధ్రా యువతి అన్నెం జ్యోతి గురువారం స్వదేశానికి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి చేరుకున్నారు. ఆమెను విమానాశ్రయం నుంచి నేరుగా మిలటరీ ఆసుపత్రికి తరలించారు. 15 రోజుల పాటు వైద్యుల పర్యవేక్షణలో జ్యోతిని వుంచుతారన్నారు. ఆమెను చూసేందుకు కుటుంబ సభ్యులకు అధికారులు అనుమతి ఇవ్వలేదని తెలుస్తోంది.