మరో 919 మందికి పాజిటివ్‌

ABN , First Publish Date - 2021-06-19T06:02:35+05:30 IST

చిత్తూరు జిల్లాలో గురు, శుక్రవారాల నడుమ 24 గంటల వ్యవధిలో 919 కరోనా పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయ్యాయి. అదే వ్యవధిలో రాష్ట్రంలోనే గరిష్ఠంగా 12 మంది ఆ వైరస్‌కు బలయ్యారు. దీంతో మొత్తం పాజిటివ్‌ కేసులు 212444కు.. మరణాల సంఖ్య 1511కు చేరాయి.

మరో 919 మందికి పాజిటివ్‌

కొవిడ్‌తో 12 మంది మృతి


తిరుపతి, జూన్‌ 18 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో గురు, శుక్రవారాల నడుమ 24 గంటల వ్యవధిలో 919 కరోనా పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయ్యాయి. అదే వ్యవధిలో రాష్ట్రంలోనే గరిష్ఠంగా 12 మంది ఆ వైరస్‌కు బలయ్యారు. దీంతో మొత్తం పాజిటివ్‌ కేసులు 212444కు.. మరణాల సంఖ్య 1511కు చేరాయి. శుక్రవారం ఉదయానికి జిల్లాలో 9902 యాక్టివ్‌ పాజిటివ్‌ కేసులున్నాయి. కొత్తగా గుర్తించిన పాజిటివ్‌ కేసులు.. తిరుపతి నగరంలో 60, చిత్తూరులో 52, పలమనేరులో 37, పీలేరు, కుప్పం మండలాల్లో 36 చొప్పున, మదనపల్లెలో 34, నగరిలో 30, తిరుపతి రూరల్‌లో 27, పుత్తూరు, వి.కోట, సోమల మండలాల్లో 23 వంతున, పెద్దపంజాణిలో 19, రేణిగుంట, రామసముద్రం, సదుం మండలాల్లో 18 వంతున, ఏర్పేడులో 17, వాల్మీకిపురం, కార్వేటినగరం మండలాల్లో 16 వంతున, పూతలపట్టు, ఐరాల, శ్రీరంగరాజపురం, కలికిరి మండలాల్లో 15 చొప్పున, గంగవరం, జీడీనెల్లూరు, కేవీపల్లె, వెదురుకుప్పం మండలాల్లో 14 వంతున, పుంగనూరు, నారాయణవనం, కలకడ, తొట్టంబేడు మండలాల్లో 13 చొప్పున, కేవీబీపురం, చంద్రగిరి, రొంపిచెర్ల, పులిచెర్ల మండలాల్లో 12 వంతున, బంగారుపాలెం, బి.కొత్తకోట, పెనుమూరు, గుడిపాల మండలాల్లో 11 వంతున, శ్రీకాళహస్తి, తవణంపల్లె, వడమాలపేట, చౌడేపల్లె మండలాల్లో 10 చొప్పున, యాదమరిలో 9, శాంతిపురం, పాకాల, కురబలకోట, రామకుప్పం, బైరెడ్డిపల్లె మండలాల్లో 8 వంతున, తంబళ్ళపల్లెలో 7, ములకలచెరువు, పాలసముద్రం, పెద్దమండ్యం మండలాల్లో 6 వంతున, వరదయ్యపాలెం, రామచంద్రాపురం, విజయపురం మండలాల్లో 5 చొప్పున, చిన్నగొట్టిగల్లులో 4, పీటీఎం, సత్యవేడు, పిచ్చాటూరు మండలాల్లో 3 చొప్పున, నాగలాపురం, బీఎన్‌ కండ్రిగ, గుర్రంకొండ, గుడుపల్లె మండలాల్లో 2 వంతున, ఎర్రావారిపాలెం, నిండ్ర, నిమ్మనపల్లె మండలాల్లో ఒక్కొక్కటి వంతున నమోదయ్యాయి.

Updated Date - 2021-06-19T06:02:35+05:30 IST