ఆర్థిక ఇబ్బందులతో మరొకరు..

ABN , First Publish Date - 2021-04-14T05:16:10+05:30 IST

ఆర్థిక ఇబ్బందులు తాళలేక ఓ వ్యక్తి చెట్టుకు ఉరేసుకుని మృతి చెందిన ఘటన మండలంలోని కొర్వీపల్లి తండాలో మంగళవారం చోటు చేసుకుంది.

ఆర్థిక ఇబ్బందులతో మరొకరు..

చిన్నశంకరంపేట, ఏప్రిల్‌ 13: ఆర్థిక ఇబ్బందులు తాళలేక ఓ వ్యక్తి చెట్టుకు ఉరేసుకుని మృతి చెందిన ఘటన మండలంలోని కొర్వీపల్లి తండాలో మంగళవారం చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. తండాకు చెందిన నునావత్‌ పెంట్యా (48)  కొన్ని రోజుల నుంచి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కుంటున్నాడు. అలాగే మృతుడి భార్య సంవత్సరం క్రితం రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో మనస్తాపానికి గురై తండా శివారులోని చెట్టకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి కుటుంబీకుల ఫిర్యాదు మేరకు పంచనామ నిర్వహించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ గౌస్‌ తెలిపారు.



Updated Date - 2021-04-14T05:16:10+05:30 IST