అంతర్వేది రథం దగ్ధంపై రాజకీయం తగదు

ABN , First Publish Date - 2020-09-20T16:55:48+05:30 IST

ఎవరో ఆకతాయిలు చేసిన పని కారణంగా..

అంతర్వేది రథం దగ్ధంపై రాజకీయం తగదు

కాళ్ళ(పశ్చిమ గోదావరి): ఎవరో ఆకతాయిలు చేసిన పని కారణంగా అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి రథం దగ్ధమైతే దానిని ప్రతిపక్షాలు రాజకీయం చేస్తున్నాయని మంత్రి పేర్ని నాని అన్నారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా రథం దగ్ధమైన 48 గంటల్లో కొత్త రథం నిర్మాణానికి రూ.95 లక్షలు మంజూరు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. రాబోయే తిరునాళ్ళలో స్వామికి తయారు చేసిన నూతన రథంలో ఊరేగింపు నిర్వహిస్తామని తెలిపారు. కరోనా కష్టకాలంలో కూడా గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన వివిధ పనుల నిమిత్తం పెండింగ్‌లో ఉన్న బిల్లుల బకాయిలను తీర్చడానికి ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసిందన్నారు. ఎన్నో ఏళ్ళుగా చిరకాల సమస్యగా ఉన్న  కలవపూడి ప్రధాన రహదారికి నిధులు మంజూరు చేసి ఖచ్చితంగా నిర్మాణం చేపడతామని హామీ ఇచ్చారు. 


Updated Date - 2020-09-20T16:55:48+05:30 IST