శవంతో ఇంటి ముందు ఆందోళన

ABN , First Publish Date - 2022-02-05T04:53:40+05:30 IST

కొల్లాపూర్‌ పట్టణంలోని ఓ స్థల వివాదం గొడవలో తన భర్తను తీవ్రంగా గాయపర్చ డంతోనే అతను మృతి చెం దాడని తనకు న్యాయం చేయాలని కోరుతూ అబ్దుల్‌రహీం(55) శవంతో భార్య రజియాబేగం కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యర్థుల ఇంటి ముందు ఆందోళన చేపట్టింది.

శవంతో ఇంటి ముందు ఆందోళన
కొల్లాపూర్‌లో ఇంటి ముందు శవం పెట్టి ఆందోళన చేస్తున్న అబ్దుల్‌రహీం బంధువులు

- కొల్లాపూర్‌లో ఉద్రిక్తత - మోహరించిన పోలీస్‌ బలగాలు


కొల్లాపూర్‌, ఫిబ్రవరి 4: కొల్లాపూర్‌ పట్టణంలోని ఓ స్థల వివాదం గొడవలో తన భర్తను తీవ్రంగా గాయపర్చడంతోనే అతను మృతి చెం దాడని తనకు న్యాయం చేయాలని కోరుతూ అబ్దుల్‌రహీం(55) శవంతో భార్య రజియాబేగం కుటుంబ సభ్యులతో కలిసి  ప్రత్యర్థుల ఇంటి ముందు ఆందోళన చేపట్టింది. ఈ సంఘటన శుక్రవారం రాత్రి కొల్లాపూర్‌లో చోటు చేసుకుంది. బాధితుల కథనం మేరకు వివరాలు... కొల్లాపూర్‌ పట్టణంలోని కొలిమివీధి లో ఓ స్థలం విషయంలో ఆరు నెలల క్రితం తన భర్త అబ్దుల్‌రహీంపై పట్టణానికి చెందిన చాంద్‌పా షా, గఫూర్‌, హుస్సేని, సలీం, తాజుద్దీన్‌, జావిద్‌లు కలిసి దాడి చేసి తీవ్రంగా గాయపర్చారు. నాటి నుంచి అనారోగ్యానికి గురైన తన భర్త  శుక్రవారం హైదరాబాద్‌ నిమ్స్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించా డు. తన భర్త మరణానికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని భార్య రజియాబేగం కొల్లాపూర్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు. తనకు న్యాయం చేయాలంటూ కోరుతూ శవంతో ప్రత్యర్థుల ఇంటి ముందు ఆందోళన చేయడంతో పట్టణంలో ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది.  ఇదిలా ఉండగా కొల్లాపూర్‌ మునిసిపల్‌ పరిధిలోని 10వవార్డుకు చెందిన అధికార పార్టీ నాయకులు, కార్యకర్తలే తన భర్త మృతికి కారణమయ్యారని అబ్దుల్‌రజియా రోదిస్తూ పేర్కొన్నారు. మృతి చెందిన అబ్దుల్‌రహీం మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు వర్గానికి చెందిన వాడు కావడంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు చర్యలు చేపట్టారు. 

Updated Date - 2022-02-05T04:53:40+05:30 IST