మంత్రి ముత్తంశెట్టికి సీఎం పరామర్శ
ABN , First Publish Date - 2020-09-21T10:04:11+05:30 IST
మంత్రి ముత్తంశెట్టికి సీఎం పరామర్శ
విశాఖపట్నం(ఆంధ్రజ్యోతి), సెప్టెంబరు 20: కొవిద్కు గురై హోమ్ ఐసోలేషన్లో చికిత్సపొందుతున్న రాష్ట్ర పర్యాటకమంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావును ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి ఫోన్లో పరామర్శించారు. మంత్రి కుమారుడు వెంకటశివనందేష్ను సీఎం పరామర్శించారు. ఇద్దరి ఆరోగ్యం, వైద్యంపై ఆరా తీసి వేగంగా కోలుకోవాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు.