సభ నుంచి టీడీపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్

ABN , First Publish Date - 2020-12-04T17:34:07+05:30 IST

నరేగా పెండింగ్ బిల్లులు చెల్లించాలని సభలో నిరసనకు దిగిన టీడీపీ ఎమ్మెల్యేలను స్పీకర్ సస్పెండ్ చేశారు.

సభ నుంచి టీడీపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్

అమరావతి: నరేగా పెండింగ్ బిల్లులు చెల్లించాలని సభలో నిరసనకు దిగిన టీడీపీ ఎమ్మెల్యేలను స్పీకర్ సస్పెండ్ చేశారు. పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలంటూ టీడీపీ ఎమ్మెల్యేలు సభలో వాయిదా తీర్మానాన్ని ప్రతిపాదించగా... దాన్ని స్పీకర్ తిరస్కరించారు. దీంతో టీడీపీ ఎమ్మెల్యేలు  పోడియం ముందుకు వెళ్లి నిరసన చేపట్టారు. వెనక్కి వెళ్లాలంటూ చెప్పినప్పటికీ ఎమ్మెల్యేలు తమ నిరసనను కొనసాగించడంతో స్పీకర్ తమ్మినేని వారిని సభ నుంచి సస్పెండ్ చేశారు. ఎమ్మెల్యేలు నిమ్మల రామానాయుడు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, జోగేశ్వరరావు, అనగాని సత్యప్రసాద్, బెందాళం అశోక్, మంతెన రామరాజును సస్పెండ్‌కు గురయ్యారు. అయతే స్పీకర్ తీరుకు నిరసనగా టీడీపీ ఎమ్మెల్యేలంతా సభ నుంచి బయటకు వచ్చేశారు. లాబీలో నినాదాలు చేస్తూ టీడీఎల్పీ కార్యాలయానికి చేరుకున్నారు.

Updated Date - 2020-12-04T17:34:07+05:30 IST