రుయా ఆసుపత్రి ఘటనపై గవర్నర్ దిగ్భ్రాంతి

ABN , First Publish Date - 2021-05-11T14:22:13+05:30 IST

తిరుపతి రుయా ఆసుపత్రిలో ఆక్సిజన్ అందక 11 మంది కోవిడ్ బాధితులు మృతి చెందిన ఘటన పట్ల గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

రుయా ఆసుపత్రి ఘటనపై గవర్నర్ దిగ్భ్రాంతి

అమరావతి: తిరుపతి రుయా ఆసుపత్రిలో ఆక్సిజన్ అందక 11 మంది కోవిడ్ బాధితులు మృతి చెందిన ఘటన పట్ల  గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా తగు చర్యలు తీసుకోవాల్సిందిగా అధికారులను గవర్నర్ ఆదేశించారు. 

Updated Date - 2021-05-11T14:22:13+05:30 IST