ఎమ్మెల్యే సామినేనికి సంబంధించి ప్రభుత్వ జీవోపై హైకోర్టులో విచారణ

ABN , First Publish Date - 2021-09-17T18:32:04+05:30 IST

జగ్గయ్యపేట ఎమ్మెల్యే సామినేని ఉదయభానుపై క్రిమినల్ కేసులు ఎత్తివేస్తూ ప్రభుత్వం తీసుకువచ్చిన జీఓపై శుక్రవారం హైకోర్టులో విచారణ జరిగింది.

ఎమ్మెల్యే సామినేనికి సంబంధించి ప్రభుత్వ జీవోపై హైకోర్టులో విచారణ

అమరావతి: జగ్గయ్యపేట ఎమ్మెల్యే సామినేని ఉదయభానుపై క్రిమినల్ కేసులు ఎత్తివేస్తూ ప్రభుత్వం తీసుకువచ్చిన జీఓపై శుక్రవారం హైకోర్టులో విచారణ జరిగింది. ప్రభుత్వ జీవోను సవాల్ చేస్తూ ఏపీజేఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు, పొలిటికల్ ఎనలిస్ట్ చెవుల కృష్ణంజనేయులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఎమ్మెల్యేపై ఉన్న క్రిమినల్ కేసులు ఎత్తివేయడం చట్టవిరుద్దం, రాజ్యాంగ విరుద్ధమని పిటిషనర్ తెలిపారు. పిటిషనర్ తరుపున న్యాయవాది జడశ్రావణ్ కుమార్ వాదనలు వినిపించారు. వాదనలు విన్న హైకోర్టు తదుపరి విచారణ రెండు వారాలకు వాయిదా వేసింది. 

Updated Date - 2021-09-17T18:32:04+05:30 IST