ఏపీ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల్లో సీఎం జగన్

ABN , First Publish Date - 2021-11-01T17:18:04+05:30 IST

ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవ వేడుకల్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాల్గొన్నారు.

ఏపీ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల్లో సీఎం జగన్

విజయవాడ: సీఎం క్యాంప్ కార్యాలయంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవ వేడుకల్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోలీసుల గౌరవ వందనం స్వీకరించి జాతీయ జెండాను ఆవిష్కరించారు. తెలుగు ప్రజల ఆత్మగౌరవం కోసం ప్రాణత్యాగం చేసి.. ఆంధ్రరాష్ట్రాన్ని సాధించుకున్న మహాపురుషుడు, అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహానికి సీఎం జగన్ పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. ఆంధ్రుల చిరకాల స్వప్నమైన ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించేందుకు ప్రాణత్యాగానికి పూనుకొని పొట్టి శ్రీరాములు అమరజీవి అయ్యారు.

Updated Date - 2021-11-01T17:18:04+05:30 IST