వేర్హౌసింగ్ కార్పొరేషన్ డిపాజిట్ల గల్లంతుపై ఫిర్యాదు
ABN , First Publish Date - 2021-10-17T06:00:29+05:30 IST
వేర్హౌసింగ్ కార్పొరేషన్ డిపాజిట్ల గల్లంతుపై ఫిర్యాదు
వన్టౌన్, అక్టోబరు 16: ఏపీ వేర్హౌసింగ్ కార్పొరేషన్ ఫిక్స్డ్ డిపాజిట్ల గల్లంతుపై జనరల్ మేనేజర్ యర్రాప్రగడ పట్టాభిరామయ్య శుక్రవారం ఇచ్చిన ఫిర్యాదు మేరకు భవానీపురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఎఫ్ఐఆర్లోని వివరాల మేరకు.. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ భవానీపురం బ్రాంచిలో గత ఏడాది డిసెంబర్ 30 నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి 24వ తేదీ వరకు పలు దఫాలుగా మొత్తం రూ.9.70 కోట్లు వేర్ హౌసింగ్ కార్పొరేషన్ అధికారులు ఫిక్స్డ్ డిపాజిట్ చేశారు. తాజాగా సంస్థ బ్యాంక్ ఖాతాలను తనిఖీ చేసినపుడు రూ.12.50 లక్షల మాత్రమే ఉండడాన్ని గమనించారు. బ్యాంకుకు వెళ్లి విచారణ చేస్తే వేర్హౌసింగ్ కార్పొరేషన్ ఫేక్ అకౌంట్తో కొల్లా బాలరాజ్ యాదవ్ పేరిట ఫోర్జరీ డాక్యుమెంట్లతో ట్రాన్ఫ్ర్ చేసినట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు.