బీజీ ఇంటర్ సెట్ పరీక్షలకు దరఖాస్తులు ఆహ్వానం
ABN , First Publish Date - 2021-06-18T05:41:51+05:30 IST
జిల్లాలోని 11 బాలయోగి సాంఘిక సంక్షేమ గురుకుల జూనియర్ కళాశాలల్లో 2021 -2022 విద్యా సంవత్సరంలో ఇంటర్ మొదటి సంవత్సరం ప్రవేశాల కోసం నిర్వహించే బీజీ ఇంటర్ సెట్ అర్హత పరీక్షల కోసం దరఖాస్తులు చేసుకోవడానికి బుధవారం నోటిఫికేషన్ జారీ అయ్యింది.
కలికిరి/కల్లూరు, జూన్ 17: జిల్లాలోని 11 బాలయోగి సాంఘిక సంక్షేమ గురుకుల జూనియర్ కళాశాలల్లో 2021 -2022 విద్యా సంవత్సరంలో ఇంటర్ మొదటి సంవత్సరం ప్రవేశాల కోసం నిర్వహించే బీజీ ఇంటర్ సెట్ అర్హత పరీక్షల కోసం దరఖాస్తులు చేసుకోవడానికి బుధవారం నోటిఫికేషన్ జారీ అయ్యింది. జూన్ 17వ తేదీ నుంచి జూలై 7 వరకూ దరఖాస్తులు చేసుకోవచ్చు. ప్రవేశ పరీక్షల తేదీలు మాత్రం తరువాత ప్రకటిస్తారు. జిల్లాలో బాలుర కోసం రామకుప్పం, బి.కొత్తకోటల్లోనూ, బాలికల కోసం శ్రీకాళహస్తి, చిత్తూరు, పీలేరు, తంబళ్లపల్లె (బురకాయలకోట), పలమనేరు, సత్యవేడు, పుత్తూరు (గోపాలకృష్ణాపురం), మదనపల్లె, కుప్పంలో సాంఘిక సంక్షేమ గురుకుల జూనియర్ కళాశాలలున్నాయి. సొంత జిల్లాలోని కళాశాలకు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. పదో తరగతి తెలుగు మీడియం విద్యార్థులతో పాటు ప్రస్తుతం పది పరీక్షలకు హాజరవుతున్న వారూ అర్హులే. వయసు ఆగస్టు 31 నాటికి 17 ఏళ్లలోగా ఉండాలి. వార్షికాదాయం రూ. లక్ష లోగా ఉండాలి. సంస్థ వెబ్సైట్ ద్వారా మాత్రమే దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. వివరాలకు చిత్తూరు జిల్లా కో-ఆర్డినేటింగ్ ఆఫీసర్ను 79955 62127 నంబరులో సంప్రదించవచ్చు.