కమిటీ నియామకం
ABN , First Publish Date - 2021-06-20T05:01:39+05:30 IST
వైవీ యూనివర్శిటీలో ఆన్లైన్ పీహెచ్డీ దరఖాస్తుల పరిశీలనకు కమిటీని నియమిస్తూ వీసీ సూర్యకళావతి ఉత్తర్వులు జారీ చేశారు.
కడప (వైవీయూ), జూన్ 19: వైవీ యూనివర్శిటీలో ఆన్లైన్ పీహెచ్డీ దరఖాస్తుల పరిశీలనకు కమిటీని నియమిస్తూ వీసీ సూర్యకళావతి ఉత్తర్వులు జారీ చేశారు. కమిటీ చైర్మన్గా రిజిస్ట్రార్ విజయరాఘవప్రసాద్ను నియమించారు. కన్వీనర్గా ప్రొఫెసర్ షావలీఖాన్ను నియమించగా సభ్యులుగా ప్రొఫెసర్లు వాసంతి, దాము, రాంప్రసాద్రెడ్డి, రఘునాథరెడ్డి, శ్రీనివాస్, రమణయ్య, నాగరాజు, గోవర్ధన్రెడ్డిలను ఎంపిక చేశారు. మాస్టర్ పీహెచ్డీ కోసం అభ్యర్థుల దరఖాస్తులను పరిశీలించి అర్హులైన వారిని కమిటీ ఎంపిక చేయనుంది.
బీవోఎస్ చైర్మన్ల నియామకం
వైవీ యూనివర్శిటీలో పలు విభాగాలకు చెందిన అసోసియేట్ ప్రొఫెసర్లను బోర్డ్ ఆఫ్ స్టడీస్ బీవోఎస్ చైర్మన్లుగా నియమించారు. ఇంగ్లీషు విభాగానికి డాక్టర్ మెర్శీ విజేత, బయోటెక్నాలజీ అండ్ బయో ఇన్ఫర్మేటిక్స్కు డాక్టర్ రియాజున్నీసా, జనటిక్స్ అండ్ జునోమిక్స్కు డాక్టర్ మాదక్కను బీవోఎస్ ఛైర్మన్లుగా వీసీ సూర్యకళావతి నియమించారు. ఇటీవలే వీరు అసోసియేట్ ప్రొఫెసర్లుగా పదోన్నతులు పొందారు. వీరి మార్గదర్శకంలో ఆయా విభాగాలకు సిలబస్ రూపకల్పన జరుగుతుంది.