మోజు తీరాక ముఖం చాటేశాడు
ABN , First Publish Date - 2021-02-25T05:09:37+05:30 IST
ప్రేమ బాసలు చేసి, పెళ్లి చేసుకుంటానని నమ్మించి శారీరక అవసరం తీర్చుకున్నాక ముఖం చాటేసిన యువకుడిని బాధితురాలి ఫిర్యాదు మేరకు కంచరపాలెం పోలీసులు బుధవారం అరెస్టు చేశారు.
ప్రేమ బాసలు చేసి పెళ్లికి నిరాకరించిన యువకుడి అరెస్టు
తాటిచెట్లపాలెం, ఫిబ్రవరి 24: ప్రేమ బాసలు చేసి, పెళ్లి చేసుకుంటానని నమ్మించి శారీరక అవసరం తీర్చుకున్నాక ముఖం చాటేసిన యువకుడిని బాధితురాలి ఫిర్యాదు మేరకు కంచరపాలెం పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. పోలీసుల కథనం మేరకు...విజయనగరం జిల్లా తెర్లాం ప్రాంతానికి చెందిన కోటిపల్లి రాధ (22) కప్పరాడలో నివాసం ఉంటోంది. అదే జిల్లా మెరకముడిదాం ప్రాంతానికి చెందిన కింతలి పృధ్వీరాజ్ (32)తో రాధకు కొన్నాళ్ల క్రితం పరిచయం అయ్యింది. ఆ పరిచయం ప్రేమగా మారి చివరికి శారీరక సంబంధానికి దారితీసింది. తీర పెళ్లి ప్రస్తావన తెచ్చేసరికి పృధ్వీరాజ్ తప్పించుకు తిరుగుతుండడంతో మోసపోయానని గుర్తించిన యువతి పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు దర్యాప్తు జరిపి ప్రాథమిక ఆధారాల మేరకు నిందితుడిని అరెస్టు చేశారు.