హత్య కేసులో నిందితుల అరెస్టు
ABN , First Publish Date - 2021-06-24T04:59:58+05:30 IST
బోయ బజారి హత్య కేసులో బుధవారం నలుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.
ఎమ్మిగనూరు, జూన్ 23: బోయ బజారి హత్య కేసులో బుధవారం నలుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. రూరల్ పోలీసు స్టేషనలో డీఎస్పీ వినోద్ కుమార్ నిందితులను వివరాలను వెల్లడించారు. బోయ నాగరాజు, బోయ కుర్నిముని స్వామి, బోయ వెంకటేశ్, బోయ నరసింహులు గుడికల్ గ్రామం నుంచి ఎమ్మిగనూరు మైనార్టీ కాలనీకి వెళ్లే దారిలో ఉన్న బోయ పెద్ద గుంటెప్ప గుడిసెలో ఉన్నారని సమాచారం రావడంతో సీఐ మంజునాథ్, ఎమ్మిగనూరు రూరల్, గోనెగండ్ల ఎస్ సునీల్ కుమార్, నాగార్జునరెడ్డిలు అక్కడికెళ్లి అరెస్టు చేశారు. వారి నుంచి వేటకొడవళ్లు, పిడిబాకు, రెండు మోటారు సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులంతా గుడికల్ గ్రామానికి చెంది నవారు. నిందితులను కోర్టులో హాజరుపర్చగా జడ్జి రిమాండ్కు ఆదేశించారు.