అరెస్టు చేయాలని నిరసన
ABN , First Publish Date - 2021-10-24T06:35:42+05:30 IST
రీజెన్సీ సంఘటనలో ఆరోపణలు ఎదుర్కొంటున్న మల్లాడి సోదరులను అరెస్టు చేయాలని పలువురు ఆందోళన చేశారు.
యానాం, అక్టోబరు 23: రీజెన్సీ సంఘటనలో ఆరోపణలు ఎదుర్కొంటున్న మల్లాడి సోదరులను అరెస్టు చేయాలని పలువురు ఆందోళన చేశారు. రీజెన్సీ కార్మికుడు మచ్చా మురళీమెహన్ మృతికి సంబంధించి స్థానిక కోర్టులో ప్రైవేటు కేసు దాఖలు చేశారు. దీనికి సంబం ధించి ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న మల్లాడి కృష్ణారావు, సత్తిబాబులు కోర్టుకు హాజరుకాకపోవడంతో కోర్టు అరెస్టు వారెంట్ జారీచేసింది. దీనిని అమలు చేయాలని పలువురు పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళన చేశారు. వీరితో పోలీసులు చర్చించారు.