అధికారిక నివాసానికి మెహబూబా ముఫ్తీ
ABN , First Publish Date - 2020-04-08T09:07:59+05:30 IST
నిర్బంధంలో ఉన్న జమ్ముకశ్మీర్ మాజీ సీఎం మెహబూబా ముఫ్తీకి పాక్షిక ఊరట లభించింది.
న్యూఢిల్లీ, ఏప్రిల్ 7: నిర్బంధంలో ఉన్న జమ్ముకశ్మీర్ మాజీ సీఎం మెహబూబా ముఫ్తీకి పాక్షిక ఊరట లభించింది. ముఫ్తీని అధికారులు మంగళ వారం ఆమె అధికారిక నివాసానికి తరలించారు. అక్కడే ఆమె నిర్బంధంలో ఉంటారు. జమ్ముకశ్మీర్లో ఆర్టికల్ 370ని రద్దు చేసిన నేపథ్యంలో ఆమెను 8 నెలలుగా ప్రభుత్వ బంగ్లాలో నిర్బంధించారు.