నిరుపేదలకు ఆసరా సీఎం సహాయనిధి

ABN , First Publish Date - 2021-06-07T06:40:38+05:30 IST

నిరుపేదలకు ఆసరా సీఎం సహాయ నిధి పథకమని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌ కుమార్‌ అన్నారు.

నిరుపేదలకు ఆసరా సీఎం సహాయనిధి
సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులను అందజేస్తున్న ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌

- జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌ కుమార్‌

జగిత్యాల టౌన్‌, జూన్‌ 6: నిరుపేదలకు ఆసరా సీఎం సహాయ నిధి పథకమని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌ కుమార్‌ అన్నారు. జగిత్యాల పట్టణంలోని 17 మంది లభ్దిదారులకు మంజూరైన రూ.3.53 లక్షల విలువ గల సీఎం సహాయ నిధి చెక్కు ను ఆదివారం క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే సంజయ్‌ కుమార్‌ బాధిత కుటుం బ సభ్యులకు అందజేశారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో కుడా సీఎం కేసీఆర్‌ ని రుపేదలకు అండగా ఉంటూ సీఎం సహాయ నిధి ద్వారా చేయూత నందిస్తున్నా రని వివరించారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ పట్టణ అధ్యక్షుడు గట్టు సతీష్‌, నాయ కులు బోగ ప్రవీణ్‌ కుమార్‌, ఆనంద రావు, దుమాల రాజ్‌ కుమార్‌, కూసరి అనీ ల్‌, కూతురు రాజేష్‌, అల్లె గంగసాగర్‌, ముస్కు నారాయణ రెడ్డి, అడువాల లక్ష్మణ్‌ తదితరులు ఉన్నారు. అనంతరం పట్టణానికి చెందిన బండారి లక్ష్మీనారాయణ కుటుంబానికి మంజూరైన రెండు లక్షల సీఎం సహాయనిధి చెక్కును ఎమ్మెల్యే సంజయ్‌ కుమార్‌ స్వయంగా బాధిత కుటుంబానికి వారి ఇంటికి వెళ్లి అందించారు. అనంతరం వ్యవసాయ మార్కెట్‌ కమిటీ డైరెక్టర్‌ బండారి విజయ్‌ తండ్రి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా బాధిత కుటుంబాన్ని ఎమ్మెల్యే సం జయ్‌ కుమార్‌ పరామర్శించారు. వైస్‌ చైర్మన్‌ గోళి శ్రీనివాస్‌ తదితరులు ఉన్నారు.


Updated Date - 2021-06-07T06:40:38+05:30 IST