Lakhimpur హింస కేసు: విచారణకు కేంద్రమంత్రి కుమారుడు గైర్హాజరు
ABN , First Publish Date - 2021-10-09T00:42:05+05:30 IST
లఖింపూర్ ఖేరి ఘటనలో ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర మంత్రి అజయ్ కుమార్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రా నేటి
లక్నో: లఖింపూర్ ఖేరి ఘటనలో ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర మంత్రి అజయ్ కుమార్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రా నేటి విచారణకు గైర్హాజరయ్యారు. కేంద్ర మంత్రి ఈ విషయాన్ని వెల్లడించారు. అనారోగ్యం కారణంగానే తన కుమారుడు విచారణకు హాజరుకాలేకపోయాడని తెలిపారు.
విచారణకు రేపు (శనివారం) హాజరవుతాడని పేర్కొన్నారు. లఖింపూర్ హింస కేసులో తన కుమారుడిపై వస్తున్న ఆరోపణలు నిజం కాదని, ఆశిష్ మిశ్రా అమాయకుడి అన్నారు. ఆశిష్కు చట్టంపై పూర్తి నమ్మకం ఉందన్నారు. లఖింపూర్ ఖేరిలో ఆందోళన చేసి తిరిగి వెళ్తున్న రైతులపై కారు దూసుకెళ్లిన ఘటనలో నలుగురు రైతులు సహా మొత్తం 9 మంది ప్రాణాలు కోల్పోయారు.