అస్సాం ముఖ్యమంత్రి దిష్టిబొమ్మ దహనం

ABN , First Publish Date - 2022-02-13T05:22:23+05:30 IST

ఎన్నికలో ఓడిపోతామ న్న భయంతో అస్సాం ముఖ్యమంత్రి రాహుల్‌గాంధీపై చేసిన అనుచి

అస్సాం ముఖ్యమంత్రి దిష్టిబొమ్మ దహనం
దిష్టి బొమ్మను దహనం చేస్తున్న కాంగ్రెస్‌ నాయకులు

మహబూబ్‌నగర్‌, ఫిబ్రవరి 12 : ఎన్నికలో ఓడిపోతామ న్న భయంతో అస్సాం ముఖ్యమంత్రి రాహుల్‌గాంధీపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా శనివారం రాత్రి అంబేడ్కర్‌ చౌరస్తాలో యువజన కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో అస్సాం ముఖ్య మంత్రి దిష్టి బొమ్మను దహనం చేశారు. రాహుల్‌గాంధీని వ్యక్తిగతంగామాట్లాడటం సరికాదన్నారు. దేశం కోసం ప్రాణా లర్పించిన కుటుంబం అని, అలాంటి వ్యక్తిపై విమర్శ లు చేస్తున్న బీజేపీకి ప్రజలే గుణపాఠం చెబుతార న్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు మహ్మద్‌ఖాదర్‌, శివశంకర్‌గౌడ్‌, బుచ్చన్న, రాములుయాదవ్‌, రవీందర్‌, మల్లేశ్‌, జాకిర్‌, కేశవ్‌, రఘు పాల్గొన్నారు. 

Updated Date - 2022-02-13T05:22:23+05:30 IST