అసోంలో కొత్తగా 3,386 మందికి కరోనా పాజిటివ్
ABN , First Publish Date - 2021-06-17T05:29:13+05:30 IST
అసోంలో కొత్తగా 3,386 కరోనా కేసులు..
గువహటి: అసోంలో ఇవాళ కొత్తగా 3,386 కొవిడ్-19 పాజిటివ్ కేసులు నమోదైనట్టు నేషనల్ హెల్త్ మిషన్ వెల్లడించింది. దీంతో ఇక్కడ మొత్తం కొవిడ్ కేసుల సంఖ్య 4,69,976కి చేరింది. ఈ మహమ్మారి కారణంగా మరో 36 మంది చనిపోవడంతో.. మొత్తం మృతుల సంఖ్య 4,064కి పెరిగింది. రాష్ట్రంలో ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 38,306 వరకు ఉన్నట్టు ప్రభుత్వం వెల్లడించింది. మరోవైపు గడిచిన 24 గంటల్లో 4,881 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. దీంతో ఇప్పటి వరకు అసోంలో కొవిడ్ మహమ్మారిని జయించిన వారి సంఖ్య 4,26,259కి చేరింది.