రత్నాల గనిలో ఘోరం! 50 మందికిపైగా సజీవ సమాధి!

ABN , First Publish Date - 2020-07-02T17:20:07+05:30 IST

మయాన్మార్‌లో పచ్చ రత్నాల గనిలో ఘోరం ప్రమాదం జరిగింది.

రత్నాల గనిలో ఘోరం! 50 మందికిపైగా సజీవ సమాధి!

నేయ్‌పీతా: మయాన్మార్‌ దేశంలోని పచ్చ రత్నాల గనిలో ఘోరం ప్రమాదం జరిగింది. ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా గనిలోకి ఒక్కసారిగా భారీగా బురద, రాళ్లు వచ్చి చేరడంతో కార్మికులు అక్కడే సజీవ సమాధి అయిపోయారు. కచీన్ రాష్ట్రంలోని పకాంత్ ప్రాంతంలో ఈ ఘోరం చోటుచేసుకుంది. ఈ ఘటనలో కనీసం 50 మంది ప్రాణాలు కోల్పోయి ఉంటారని అక్కడి అధికారులు భావిస్తున్నారు. ప్రమాద సమయంలో వారందరూ పచ్చ రత్నాలను ఏరే పనిలో నిమగ్నమై ఉన్నారని అధికారులు తెలిపారు. విషయం తెలిసిన వెంటనే రంగంలోకి దిగిన ఎమర్జెన్సీ సర్వీసు సిబ్బంది సహాయక చర్యలు చేప్పటారు. అయితే ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది. మరోవైపు..ఈ ప్రాంతంలో చట్టవ్యతిరేకంగా రత్నాల సేకరణ జరుగుతూ ఉంటుందని స్థానిక మీడియా కథనాలు చెబుతున్నాయి. కొండచరియలు విరిగిపడటం, ఇతర ప్రమాదాల కారణంగా నిత్యం అనేక మంది అభాగ్యులు ప్రాణాలు కోల్పోతుంటారని కూడా తెలిసింది.

Updated Date - 2020-07-02T17:20:07+05:30 IST