‘బీజేపీ కార్యకర్తలపై దాడి హేయం’
ABN , First Publish Date - 2021-01-14T05:43:28+05:30 IST
బీజేపీ జనగామ పట్టణ అధ్యక్షుడు పవన్శర్మపై పోలీసులు లాఠీ చార్జీ చేయడం హేయమని పలువురు నాయకులు అన్నారు.
ఆత్మకూరు(ఎం)/ భూదాన్ పోచంపల్లి/ తుర్కపల్లి/ భువనగిరి టౌన్, జనవరి 13: బీజేపీ జనగామ పట్టణ అధ్యక్షుడు పవన్శర్మపై పోలీసులు లాఠీ చార్జీ చేయడం హేయమని పలువురు నాయకులు అన్నారు. దాడిని నిరసిస్తూ ఆత్మకూరు (ఎం)లోని మెయిన్ రోడ్పై బుధవారం రాస్తారోకో నిర్వహించారు. కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్ష, కార్యదర్శి టి.మల్లారెడ్డి పాల్గొన్నారు. పోచంపల్లిలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు పీవీ.శ్యాంసుందర్రావు ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. తుర్కపల్లి, భువనగిరిలో రాష్ట్ర ప్రభుత్వ దిష్టి బొమ్మను దహనం చేశారు. కార్యక్రమంలో గూడూరు నారాయణరెడ్డి, మహేందర్గుప్తా పాల్గొన్నారు.