మారిన ధోరణి... ‘వర్క్ ఫ్రం హోం’ చేద్దాం...

ABN , First Publish Date - 2020-08-04T20:03:33+05:30 IST

ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా నేపధ్యంలో... పెద్ద సంఖ్యలో సంస్థలు... ప్రత్యేకించి ఐటీ కంపెనీలు... ‘వర్క్ ఫ్రం హోమ్(డబ్ల్యూఎఫ్‌హెచ్)’ తో నడిపిస్తోన్న విషయం తెలిసిందే.

మారిన ధోరణి... ‘వర్క్ ఫ్రం హోం’ చేద్దాం...

న్యూఢిల్లీ : ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా నేపధ్యంలో... పెద్ద సంఖ్యలో సంస్థలు... ప్రత్యేకించి ఐటీ కంపెనీలు... ‘వర్క్ ఫ్రం హోమ్(డబ్ల్యూఎఫ్‌హెచ్)’ తో నడిపిస్తోన్న విషయం తెలిసిందే. 


గత కొంతకాలంగా... రిమోట్ వర్క్(డబ్ల్యూఎఫ్‌హెచ్) కోసం వెతుకుతోన్న వారి సంఖ్య పెరుగుతోందట. ఈ ఏడాది ఫిబ్రవరి-జూలై మధ్య... ఇళ్ళ నుండి పని చేసే ఉద్యోగాల కోసం వెతకడం 44.2 శాతం పెరిగినట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. కాగా... కరోనా నేపథ్యంలో చాలా కంపెనీలు తమ ఉద్యోగులకు తాత్కాలికంగా లేదా శాశ్వతంగా కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చాయి.


ఇక ఇదే విధానాన్ని పూర్తిగా అమలు చేయాలని కొన్ని ఐటీ సంస్థలు భావిస్తున్నాయి. క్రమంగా మరో ఐదేళ్ళ నాటికి 75 శాతం వర్క్ ఫ్రమ్ హోమ్, 25 శాతం కార్యాలయాలనుండి పని చేసే పరిస్థితిని తీసుకు రావాలని భావిస్తున్నాయి.


దీంతో చాలామంది ఉద్యోగార్థులు లేదా ఉద్యోగులు కూడా దీనిపై ఆసక్తి కనబరుస్తున్నట్లు గ్లోబల్ జాబ్ సైట్ ఇండీడ్ నివేదిక ద్వారా వెల్లడైంది. 

Updated Date - 2020-08-04T20:03:33+05:30 IST